సినీ పరిశ్రమలో రాజకీయాలు

టాలీవుడ్ లో ఎవరి గోతులు వాళ్లే తీసుకుంటున్నారని డైలాగ్ కింగ్ మోహన్‌బాబు విమర్శించారు. మూడేళ్ల తర్వాత ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. తాజాగా ఆయన ఆ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఓ ఛానల్‌ కిచ్చిన ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలో చోటుచేసుకున్న వివాదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రితో భేటీకి తనకు కూడా ఆహ్వానం ఉందని.. కానీ కావాలనే కొందరు తనని దూరం పెట్టారని మోహన్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట రాజకీయాల మాదిరిగానే పరిశ్రమలోనూ రాజకీయాలు జరుగుతున్నాయి. ఎవరికి వారే గ్రేట్‌ అనుకుంటున్నారు. నా గురించి ఎవరో ఏదో అనుకుంటే అది వాళ్ల కర్మ. ఎదుటివాళ్ల మాటల్ని పట్టించుకోను. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదని అందరూ తెలుసుకోవాలని హితువు పలికారు డైలాగ్ కింగ్.