బ్రెజిల్‌లో వరద బీభత్సం.. 117 మంది మృతి

 బ్రెజిల్‌లో భారీ వర్షాలు, వరదలకు వందలమంది బలయ్యారు. పెట్రోపొలిస్‌ నగరంలో గత మంగళవారం కుండపోత వర్షం కురిసింది. కొన్ని దశాబ్దాల తర్వాత అక్కడ కేవలం మూడు గంటల్లోనే 25.8 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. దీంతో వరదలు పొటెత్తాయి.

 ఫలితంగా మట్టి చరియలు విరిగిపడి సమీపంలోని నివాస ప్రాంతాలను ముంచెత్తాయి. ఈ ఘటనలో కనీసం 117 మంది మృతిచెందగా.. మరో 116 మంది గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. వీధుల్లో కార్లు గుట్టల్లా పోగుపడి ఉన్నాయి. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు 24 మందిని కాపాడారు. ఇంకా 116 మంది అచూకీ తెలియరాలేదు.