సోనూసూద్ కారు సీజ్

బాలీవుడ్ నటుడు సోనూసూద్ కారును ఎన్నికల సంఘం అధికారులు సీజ్ చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సోనూసూద్ సోదరి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు పోలింగ్ సందర్భంగా సోనూసూద్ కారులో పోలింగ్ బూత్ ల చుట్టూ తిరుగుతూ.. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. డబ్బులు పంచుతున్నారు అనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారులు సోనూసూద్ కారును సీజ్ చేశారు. దీనిపై సోనూసూద్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

 
సోనూసూద్ నటుడి కంటే మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నారు. కరోనా విజృంభిస్తున్న టైమ్ లో ఆయన కనిపించే దేవుడిగా మారి పేద ప్రజలను ఆదుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథంలో సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరిగింది. కానీ సోనూసూద్ కంటే ముందుగా ఆయన సోదరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా జరుగుతున్న పంజాబ్ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరిష్కరించబోతున్నారు.