ఆట మొదలెట్టా..

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామాను వాయిదా వేసుకున్నారు. 15 రోజులు వేచి చూసి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి. నేను ఆట ప్రారంభించా.. వేచి చూడాలి. నా వెనుక ఎవరూ లేరు. పీసీసీ అధ్యక్షుడు వచ్చి కలిసినా పార్టీలో ఉండే పరిస్థితి లేదు. పులి లాంటి నేను ఎలుకలతో పోట్లాడను అన్నారు.

పీసీసీ అధ్యక్షుడు సమస్య మూలాలను తెలుసుకోవట్లేదు. టీ కప్పులో తుపాను అంటూ తేలిగ్గా కొట్టి పారేస్తున్నారు. అసలు సమస్య ఎందుకు వచ్చిందో ఆలోచించట్లేదు. పార్టీలోని కొందరు నేతలు రెండ్రోజులుగా నాకు సర్ది చెబుతున్నారు. నా మీద దుష్ప్రచారం జరుగుతోంది. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలను కలిస్తే నా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అనుకుంటున్నా. ఢిల్లీ అపాయింట్‌మెంట్‌ కోసం మా సీనియర్లు ప్రయత్నం చేస్తున్నారు. అవకాశం వస్తే వెళ్లి కలుస్తానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చిర్రు.