ఈటీ ట్రైలర్ ఎప్పుడంటే ?

కోలీవుడ్ స్టార్ సూర్య లెటెస్ట్ సినిమా ‘ఇతజ్కుం తునింటావం’ (Etharkkum Thunindhavan). ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్. వినయ్ రాయ్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. మార్చి 10న ET ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. మార్చి 11న ఉదయం 11 గంటలకు ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్టు తెలిపింది.అయితే తెలుగు ట్రైలర్ గురించి మేకర్స్ అప్డేట్ ఏమి ఇవ్వలేదు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ సినిమా తెలుగు,హిందీ,కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే.