రాధే శ్యామ్‌.. ఆ విభాగంలో నేషనల్ అవార్డ్ ఖాయం !

ప్రభాస్-పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. ఈ ప్రేమకథా చిత్రాన్ని దాదాపు రూ. 300కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమా కోసం ఎంచుకున్న నేప‌థ్యం బ‌డ్జెట్ ని పెంచేశాయి. ముఖ్యంగా సెట్స్‌కి ఎక్కువ ఖ‌ర్చ‌య్యింది. ఈ సినిమా కోసం ఏకంగా 101 సెట్స్ వేశారు. దాదాపు రూ. 100 కోట్లు ఖర్చు చేశారు.

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్‌ అద్భుతమైన సెట్స్ వేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే సినిమా చూసిన దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి చెప్పారు. అంతేకాదు.. ఆర్ట్ విభాగంలో ఈ సినిమాకి ఆర్ట్ లో నేష‌న‌ల్ అవార్డు వ‌స్తుందనిపిస్తోంద‌`ని కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు.

ఈ సినిమా కోసం నాలుగు ట్రైన్ సెట్స్ వేశారు ర‌వీంద‌ర్‌. ఓ భారీ షిప్ సెట‌ప్ కూడా ఉంది. నిజానికి ఇటాలియ‌న్ క‌ల్చ‌ర్‌లో ఓ ఇండియ‌న్ సినిమా, అందులోనూ తెలుగు సినిమా తీయ‌డం ఇదే తొలిసారి. ఇట‌లీ క‌ట్ట‌డాల్ని పోలిన నిర్మాణాలు హైద‌రాబాద్‌లో సెట్స్ రూపంలో తీర్చిదిద్దారు. అక్క‌డి ట్రైన్ సెట‌ప్ మొత్తం ఇక్క‌డ రీ క్రియేట్ చేశారు. క్లైమాక్స్ అంతా షిప్ లోనే. ఈ త‌ర‌హా క్లైమాక్స్ తెలుగులోనే కాదు, ఇండియ‌న్ స్క్రీన్ పైనే చూడ‌లేదంటున్నారు.