ఉపాధ్యాయుల బదిలీలకు మార్గం సుగుమం

తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలకు మార్గం సుగమమైంది. ఉపాధ్యాయుల బదిలీలపై దాఖలైన పిటిషన్‌లన్నింటిని కలిపి హైకోర్టు విచారణ జరిపింది.బదిలీలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అదే సమయంలో.. డీఈవోలకు బదిలీల ఉత్తర్వులు జారీ చేసే అధికారమిచ్చిన జీవోలోని 4వ నిబంధనని కోర్టు తప్ప పట్టింది.

మిగతా వివాదాలకు సంబంధించి జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల బదిలీలకు అడ్డు తొల్లగినట్టయ్యింది. ఇక, బదిలీ ఉత్తర్వులను జారీచేసే అధికారాన్ని డీఈవోలకు బదులుగా ఆర్‌జేడీలకు అప్పగిస్తూ జీవోను సవరించే అలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.