బ్రేకింగ్ : తప్పిన ఘోర రైల్ ప్రమాదం

ముంబైలో ఘోర రైల్ ప్రమాదం తప్పింది. ఈ ఉదయం అంధేరీ రైల్వే స్టేషన్‌ను ఆనుకుని ఉన్న గోఖలే రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి కొంత భాగం కుప్పకూలి ట్రాక్‌పై పడిపోయింది. ఆ సమయంలో రైళ్లేవి ఆ మార్గంలో రాలేదు. దీంతో.. ఘోర రైల్ ప్రమాదం తప్పినట్టయ్యింది. ఈ ఘటన జరిగిన వెంటనే పశ్చిమ లైన్‌పై రైళ్ల రాకపోకను అధికారులు నిలిపివేశారు.

ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరిగిన వివరాలు వెలుగులోనికి రాలేదు. ఇద్దరు గాయాలపాలైనట్టు తెలుస్తోంది. ఐతే, శకలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తూర్పు-పశ్చిమ అంధేరీలను కలుపుతూ గోఖలే బ్రిడ్జిని నిర్మించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.