మిర్చి కాంబో.. రిపీట్ !

ప్రభాస్ ‘మిర్చి’ సినిమాతో కొరటాల శివ దర్శకుడిగా మారాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత ప్రభాస్ తో మరో సినిమా చేయలేదు. ఇప్పుడు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్టు సమాచారం. తాజాగా.. ప్ర‌భాస్ – కొర‌టాల మ‌ధ్య ఓ భేటీ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా కొర‌టాల‌.. ప్ర‌భాస్‌కి ఓ క‌థ చెప్పాడ‌ని టాక్‌. 

ప్ర‌భాస్ కూడా కొర‌టాల‌తో సినిమా చేయ‌డానికి చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడ‌ట‌. యూవీ బ్యాన‌ర్‌లోనే ఈ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది. అయితే… ప్ర‌భాస్ ఫుల్ బిజీగా ఉన్నాడిప్పుడు. త్వ‌ర‌లోనే మారుతి సినిమా ప‌ట్టాలెక్కిస్తాడు. ప్రాజెక్ట్ కె.. ఉండ‌నే ఉంది. స‌లార్‌…ఇంకా సెట్స్ పైనే ఉంది. వీటిమ‌ధ్య కొర‌టాల‌కు డేట్లు ఎప్పుడిస్తాడో చూడాలి.