పార్థు కాదు అర్జునుడు

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా అతడుకు సీక్వెల్ గా తెరకెక్కబోతుంది. అతడులో మహేష్ పేరు పార్థు నే టైటిల్ గా పెట్టబోతున్నారనే  వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం. అర్జునుడు అనే టైటిల్ ని ఈ సినిమా కోసం ప‌రిశీలిస్తున్నారు. దాదాపుగా అదే లాక్ చేసే అవ‌కాశం ఉంది. 

త్రివిక్ర‌మ్‌కి సెంటిమెంట్ ఎక్కువ‌. అతడు, అ ఆ, అజ్ణాతవాసి, అరవింద సమేత, అల.. వైకుంఠపురంలో ఇలా అ పై అభిమానం చాటుకున్నారు మాటల మాంత్రికుడు. అత‌డులో మ‌హేష్ పేరు పార్థు. ఈ సినిమాకి ఆ పేరే ఫిక్స్ చేస్తార‌ని అనుకున్నారంతా. అర్జునుడికి మ‌రో పేరు పార్థు. సో… త్రివిక్ర‌మ్ ఈ పేరు ఫిక్స్ చేయ‌డానికి ఇది కూడా ఓ కార‌ణం కావొచ్చు. మే 31 కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ ని రివీల్ చేసే అవ‌కాశం ఉంది.