రేణుతో మళ్లీ కలిసిపోయిన పవన్

కొడుకు అకీరానంద్ స్కూల్ graduation ceremony కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఇద్దరు పిల్లలు, మాజీ భార్య రేణు దేశాయ్ తో కలిసి ఫోటోలు దిగారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పిక్ ఆఫ్ ది డే అంటూ పవన్ అభిమానులు ఈ ఫోటోలను షేర్ చేశారు. ఫ్యామిలీ కలుసుకున్న ఆనందం పవన్ కళ్లలో కనిపించింది.

పిల్లలకు చెరో వైపు నిలబడిన పవన్, రేణు హ్యాపీగా కనిపించారు. అకీరానంద్ అయితే.. మెమరబుల్ డే అంటూ ఫ్యామిలీ దిగిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. వాస్తవానికి పవన్-రేణు విడిపోవడం అభిమానులకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు పిల్లల కోసం కలవడంతో.. పవన్ – రేణు మళ్లీ కసిరోయ్ అంటూ కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 

ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో యాక్టివ్ గా తిరుగుతున్నారు పవన్. ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమా, సురేందర్ రెడ్డి సినిమాలు లైన్ లో ఉన్నాయి.