యాదాద్రి ప‌నులపై సీఎస్ స‌మీక్ష‌

యాదగిరిగుట్టపై లక్ష్మీనరసింహా దేవాలయ పరిధిలో చేపడుతున్న వివిధ పనులను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు.మంగళవారం సచివాలయంలో యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్ మెంట్ అధారిటీతో ఆయ‌న స‌మీక్ష నిర్వ‌హించారు. దేవాలయనిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు సీఎస్. కాటేజీలు, విల్లాలు, ప్లాట్ల నిర్మాణం, రాయగిరి గండి ఇరిగేషన్ చెరువుల సుందరీకరణ, రాయగిరి వద్ద ROB నిర్మాణ పనులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల ప్రకారం పనులన్నీ ప్రణాళిక ప్రకారం పూర్తికావాలన్నారు సీఎస్. వేద పాఠశాల నిర్మాణానికి అవసరమైన చోట ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వైస్ ఛైర్మన్ కిషన్ రావు, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శివశంకర్, R&B ENC లు గణపతిరెడ్డి, రవీందర్ రావు, ఆల‌య ఈ.ఓ గీత, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.