బీజేపీకి ప్ర‌భాస్ ప్ర‌చారం..!? క్లారిటీ ఇచ్చిన రెబ‌ల్ స్టార్..!!

బాహుబ‌లితో జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న హీరో ప్ర‌భాస్ పై ఇప్పుడు ఓ ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. గ‌తంలో బాహుబ‌లి2 విడుద‌ల సంద‌ర్భంలో కృష్ణంరాజుతో క‌లిసి ప్ర‌భాస్ ప్ర‌దాని మోదీని క‌లిసిన సంగ‌తి తెలిసిందే.అప్ప‌ట్లో ప్ర‌భాస్ సినిమా గురించే ప్ర‌ధానినిక‌లిసినా ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాలను గ‌మ‌నిస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌పున ప్ర‌చారం చేస్తారనే ప్ర‌చారం ఊపందుకుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భాస్ పై జ‌రుగుతున్న ప్ర‌చారంపై కృష్ణం క్లారిటీ ఇచ్చారు.

ప్ర‌భాస్ ను ఇప్పుడ‌ప్పుడే రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చే ఆలోచ‌న లేద‌ని, బీజేపీ త‌రుపున ఆయ‌న ప్ర‌చారం చేస్తార‌ని జ‌రుగుతున్న ప్ర‌చారం నిజం కాద‌ని కృష్ణం రాజు తేల్చి చెప్పారు. ప్ర‌భాస్ కు సినిమాల్లో ఇంకా చాలా భ‌విష్య‌త్ ఉంద‌ని రాజ‌కీయాల్లోకి ఇప్పుడే రాడ‌ని చెప్పారాయ‌న‌. ఏపీలో చంద్ర‌బాబు బీజేపీపై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని, బీజేపీ ద్రోహం చేసింద‌నే విధంగా ఏపీ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ ఆదేశాల మేర‌కు తాను ప‌నిచేస్తాన‌ని ఆయ‌న చెప్పారు. కృష్ణం రాజు వ్యాఖ్య‌ల‌తో ప్ర‌భాస్ పై జ‌రుగుతున్న ప్రచారానికి పుల్ స్టాప్ ప‌డిన‌ట్ల‌యింది..