వావ్.. ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయ్‌ !

అబ్బో గాల్లో ఎగిరే బైకులు వస్తే ఎంత బాగుణ్ను. ఇలాంటి కలలు కనేవారికి తీపికబరు. ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయ్‌. రోడ్లపై ట్రాఫిక్‌ ఇబ్బందులకు చెక్‌ పెట్టేలా దిల్లీకి చెందిన ‘ఈ-ప్లేన్‌’ అనే సంస్థ ఎయిర్‌ ట్యాక్సీలను రూపొందించింది. ఇద్దరు వ్యక్తులు ప్రయాణించేలా.. హెలికాప్టర్‌ మాదిరిగా దీన్ని తీర్చిదిద్దారు. వచ్చే ఏడాది ట్రయల్‌రన్‌ నిర్వహిస్తామని అంటున్నారు.

ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన డ్రోన్‌ ఫెస్టివల్‌లో ఈ-ప్లేన్‌ సంస్థ ఎయిర్‌ట్యాక్సీ మోడల్‌ను ప్రదర్శించింది. అందరూ దీన్ని ఆసక్తిగా తిలకించారు. ఈ-20 పేరుతో ఎయిర్‌ట్యాక్సీ నమూనా రూపొందించారు. హెలికాప్టర్‌లాగే గాలిలో ఎగురుతుంది. క్షణాల్లో చేరాల్సిన చోటుకు చేర్చుతుంది.