ఆ సీన్ కోసం రోజంతా పస్తులు

సాయి పల్లవి మంచి నటి. పాత్ర కోసం ప్రాణం పెట్టి నటించే నటి. ఆమె డెడికేషన్ ఏ రేంజ్ లో ఉంటుందనడానికి మరో ఎగ్జాంపుల్ ఇది. పాత్ర కోసం ఆమె ఒక రోజంతా ఏమీ తినలేదట. వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా-సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం విరాట పర్వం. 1990ల్లో తెలంగాణలో జరిగిన కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా, నక్సల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన చిత్రమిది.

ఇందులో రానా హీరోనే అయినప్పటికీ, సినిమా మొత్తం సాయిపల్లవి పాత్ర చుట్టూ తిరుగుతుంది. వెన్నెల అనే పాత్ర పోషించిన సాయిపల్లవి, ఈ సినిమాలో ఓ సీన్ కోసం నీరసంగా కనిపించాలి. దాని కోసం ఆమె ఒక రోజంతా తినడం మానేసిందట.ఈ విషయాన్ని దర్శకుడు వేణు ఊడుగుల చెప్పుకొచ్చాడు. ఓ క్యారెక్టర్ కోసం సాయిపల్లవి పడే కష్టం ఆ రేంజ్ లో ఉంటుందని వివరించాడు. ఇక జులై 1న రిలీజ్ కావాల్సిన విరాటపర్వం జూన్ 17 కి ప్రీ ఫోన్ అయింది.