బ్రహ్మాస్త్ర ట్రైలర్ టాక్

బాలీవుడ్‌ డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఫాంటసీ అడ్వంచర్ ‘బ్రహ్మాస్త్ర’. రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియాభట్ ప్రధాన పాత్రల్లో నటించారు. అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున కీలకపాత్రలు పోషించారు. మూడు భాగాలుగా సిద్ధమవుతోన్న ఈ ప్రాజెక్ట్‌లోని మొదటి భాగాన్ని ‘బ్రహ్మాస్త్రం.. పార్ట్‌-1 శివ’ అనే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సెప్టెంబర్‌ 9న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు.

”నీరు, గాలి, నిప్పు.. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ శక్తులన్నీ కొన్ని అస్త్రాలలో ఇమిడి ఉన్నాయి. ఈ కథ అస్త్రాలన్నింటికీ అధిపతి అయిన బ్రహ్మాస్త్రానిది. ఆ బ్రహ్మాస్త్రం విధి తన అరచేతి రేఖలలో చిక్కుకుని ఉందన్న విషయం ఆ యువకుడికే తెలియదు. అతనే శివ” అంటూ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌లోని ప్రతి సీన్‌ అద్భుతంగా సాగింది. దాదాపు రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కింది.