ఆగస్టు 8న తిరుచిత్రంబలం

కోలీవుడ్ స్టార్ ధనుష్ తాజా చిత్రం ‘తిరుచిత్రంబలం’.  ఈ చిత్రానికి మిత్రన్ జవహర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ధనుష్ టైటిల్ రోల్‌లో రాశి ఖన్నా, నిత్యా మీనన్, ప్రియా భవానీ శంకర్, ప్రకాష్ రాజ్ మరియు భారతీరాజా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ.. మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. వైవిధ్యమైన ట్యూన్ తో కట్ చేసిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంది. ధనుష్ గత చిత్రం మారన్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో  ‘తిరుచిత్రంబలం’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే వదిలిన ధనుష్ పోస్టర్స్ స్పెషల్ గా అనిపించాయి.

Well it’s been a while isn’t ? Thiruchitrambalam from august 18th. See you all in theatres. pic.twitter.com/foFZmqronV— Dhanush (@dhanushkraja) June 15, 2022