అప్పులన్నీ తీర్చేస్తా.. కమల్ ఆనందం !

చాన్నాళ్ల తర్వాత విక్రమ్ తో కమల్ హాసన్ కు కమర్షియల్ హిట్ దక్కింది. ‘విక్రమ్‌’ విడుదలైన రెండు వారాల్లో రూ.300 కోట్లు వసూళ్లు చేయడంపై తాజాగా కమల్‌ స్పందించారు. గతంలో నేను రూ.300 కోట్లు సంపాదిస్తానంటే ఎవరూ నా మాట నమ్మలేదు. అసలు వాళ్లు నా మాటల్ని అర్థం చేసుకోలేదు కూడా. ‘విక్రమ్‌’ వసూళ్లతో ఇప్పుడు నా మాట నిజమైంది.

ఇక, ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా. నాకిష్టమైన ఆహారాన్ని తింటా. కుటుంబం, సన్నిహితులకు ఆర్థికంగా చేతనైనంత సాయం చేస్తా. నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం అయిపోయాక.. ఇవ్వడానికి ఏమీ లేదని చెప్పేస్తా. వేరే వాళ్ల దగ్గర డబ్బు తీసుకుని పక్కన వాళ్లకి సాయం చేయాలనే ఉద్దేశం లేదు. నేను ఒక మంచి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నానని కమల్ చెప్పుకొచ్చారు.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ తెరకెక్కింది. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్, సూర్య కీలక పాత్రల్లో నటించారు. విడుదలైన అన్ని భాషల్లో బంపర్ వసూళ్లు రాబడుతోంది. తమిళ్ లో ఇప్పటికే రూ. 200కోట్ల మార్క్ క్రాస్ చేసింది.