తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం : ఖుష్బు

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమన్నారు నటి, భాజపా నేత ఖుష్బు. హైదరాబాద్ లోని హెచ్‌ఐసీసీ వేదికగా జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఖుష్బు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. తెలంగాణలో పార్టీ కార్యకలాపాలను నిర్వహించడం బీజేపీకి పెద్ద కష్టమైన పని కాదు. ఎక్కడైనా పోటీ అనేది ఉండాలి. మాకు సరైన పోటీ ఉండాలనే మేం భావిస్తున్నాం. పోటీ లేకపోతే ఎలాంటి ఆసక్తి ఉండదు. మోడీ వెనక్కి పోవాలని.. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ప్రధానికి వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్స్‌ పెట్టారు. అవన్నీ చూస్తుంటే టీఆర్ఎస్ భయపడుతున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఎక్కడా వారసత్వ పాలన ఉండకూడదు. ఇప్పటికే ఎక్కవ అయింది. ఇంకా వారసత్వ రాజకీయాలను సహించేది లేదు” అన్నారు.