తెలంగాణలోనూ డబుల్‌ ఇంజిన్‌ సర్కారు : మోడీ

తెలంగాణ ప్రజలకు బీజేపీపై ఎన్నో రెట్లు నమ్మకం పెరిగిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు కోసం ప్రజలు పట్టాలు వేస్తున్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో మోడీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆవిష్కరణలకు దేశంలోనే తెలంగాణ కేంద్రంగా మారిందన్నారు.

రాష్ట్ర రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మెగా టెక్స్‌టైల్‌ పార్కు నిర్మిస్తామని తెలిపారు. ప్రాచీన సంస్కృతి, పరాక్రమాల పుణ్యస్థలం తెలంగాణ మోడీ వ్యాఖ్యానించారు. తెలంగాణకు ఎంతో సాయం చేశాం. కరోనా సమయంలో ఉచిత రేషన్, ఉచిత వ్యాక్సిన్ అందజేశాం అన్నారు.