నేడే ఇంగ్లాండ్‌తో రెండో వన్డే.. కోహ్లే డౌటే !

టీమ్‌ఇండియా ఇంగ్లిష్‌ గడ్డ మీద మరో సిరీస్‌పై కన్నేసింది. ఇప్పటికే ఇంగ్లాండ్‌లో టీ20 సిరీస్‌ నెగ్గిన భారత్‌.. ఇప్పుడు వన్డే సిరీస్‌నూ చేజిక్కించుకునేందుకు సిద్ధమైంది. లార్డ్స్‌లో బట్లర్‌ సేనతో నేడే రెండో వన్డే ఆడనుంది. సాయంత్రం 5.30 నుంచి మ్యాచ్ షురూ కానుంది.

బౌలింగ్‌, బ్యాటింగ్‌లో రాణించిన భారత్‌ గత మ్యాచ్‌లో ప్రత్యర్థిని 10 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది. అదే జోరుతో గురువారం జరిగే రెండో డేనైట్‌ వన్డేలోనూ విజయదుందుభి మోగించి.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. గజ్జల్లో గాయం కారణంగా తొలి వన్డేకు దూరమైన విరాట్‌ కోహ్లి.. ఈ మ్యాచ్‌లోనూ ఆడేది అనుమానమే. అతడి ఫిట్‌నెస్‌పై స్పష్టత లేదు. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌కు సిరీస్‌ను మళ్లించాలని ఇంగ్లాండ్‌ చూస్తోంది.