ఆ పాప‌కు ఏసీపీ చేత‌న పేరు..!!

ఈ నెల 2వ తేదీన 12 గంటల సమయంలో కిడ్నాప్ అయిన కోఠి ఆసుప‌త్రిలో శిశువు త‌ల్లి ఒడికి చేరింది. బీద‌ర్ లో సేఫ్ గా పాప‌ను స్వాధీనం చేసుకున్న తెలంగాణ పోలీసులు త‌ల్లి ఒడికి చేర్చారు. నీలోఫ‌ర్ ఆసుప‌త్రిలో ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్న ఆ పాప‌ను చూసి త‌ల్లి మురిసిపోయింది.మ‌హిళా కిడ్నాప‌ర్ ను పోలీసులు అరెస్టు చేశారు. మ‌రో ఇద్ద‌రు అనుమానితుల‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఏసీపీ చేత‌న‌ను సీపీ అంజ‌నీ కుమార్ అభినందించారు. త‌న కూతురును త‌న చెంత‌కు చేర్చినందుకు పోలీసుల‌కు పాప త‌ల్లి ధ‌న్యవాదాలు తెలిపింది. త‌న కూత‌రు పేరు ఏసీపీ చేత‌న పేరు నామ‌క‌ర‌ణం చేస్తాన‌ని తెలిపింది పాప‌త‌ల్లి. అన్ని ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం చేస్తామ‌న్నారు హైద‌రాబాద్ సీపీ అంజ‌నీ కుమార్.