నిర్మాత శేఖర్‌రాజుపై ఆర్జీవీ ఫిర్యాదు

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పోలీస్ గొడప తొక్కారు. సినీ నిర్మాత శేఖర్‌రాజుపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘లడ్కీ: ఎంటర్‌ ది గర్ల్‌ డ్రాగన్‌’ చిత్రంపై తప్పుడు సమాచారంతో సివిల్‌ కోర్టులో శేఖర్ రాజు కేసు వేశారు. కోర్టును తప్పుదోవ పట్టించారు. దీంతో సినిమా నిలుపుదల చేయాలని ఈరోజు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సినిమాపై ఎంతోమంది ఆధారపడి ఉన్నారని చెప్పారని చెప్పిన ఆర్జీవి… శేఖర్‌రాజు తనకు నగదు ఇవ్వాలని.. లడ్కీ చిత్రంపై తప్పుడు సమాచారంతో సివిల్‌ కోర్టులో ఆయన కేసు వేశారని ఆరోపించారు. అయితే ఆర్జీవీ ఫిర్యాదుపై శేఖర్ రాజు ఇంకా స్పందించాల్సి ఉంది. ఇటీవల వర్మకు ఓ నిర్మాతతో విబేధాలు తలెత్తిన సంగతి తెలిసిందే. దీంతో స్వయంగా సదరు నిర్మాత దగ్గరకు వెళ్లి.. సమస్యను పరిష్కరించుకున్నారు వర్మ. ఈ సారి ఆయనే మరో దర్శకుడిపై ఇలా పోలీసు గడప తొక్కారు.