కిషన్ రెడ్డి మోసం చేస్తుండు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు మంత్రి కేటీఆర్. రాష్ట్రానికి వరదసాయం విషయంలో కిషన్‌రెడ్డి తప్పుడు లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. NDRF ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక, అదనపు నిధులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తే… రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా, హక్కుగా దక్కే SDRF గణాంకాల చెప్పి మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులను కూడా కేంద్రమే విడుదల చేసినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

కేంద్రానికి రాష్ట్రం చెల్లించే పన్నుల నుంచే తిరిగి రాజ్యాంగ పద్ధతుల్లో రాష్ట్రానికి దక్కే మార్గాల్లో SDRF ఒకటి. అయితే విషయం తెలియని.. ఈ విషయంపై అవగాహన లేని కిషన్ రెడ్డి.. అవి కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన వరదసాయంగా చెప్పుకొంటున్నారన్నారు. హైదరాబాద్‌ వరదలతో పాటు ప్రస్తుతం వచ్చిన వర్షాలు, వరదల నష్టంపై సాయం నిల్ అన్నారు.