టైగర్ కొత్త సినిమా.. ఎనౌన్స్ మెంట్ టీజర్ !

బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు. తాజాగా ఫిల్మ్ అనౌన్స్ మెంట్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టైగర్ ష్రాఫ్ – శంశాక్ ఖైతాన్ కలిసి చేస్తున్న తొలి సినిమా ఇది. కరణ్ జోహార్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

మూడు నిమిషాల నిడివితో సినిమా ఎనౌన్స్ మెంట్ టీజర్ ను వదిలారు. అదిరిపోయే యాక్షన్ సీన్స్ తో టీజర్ ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాలో టైగర్ తో రష్మిక మందన రొమాన్స్  చేయనుంది. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉన్నాయి. యాక్షన్ హీరోగా ఇప్పటికే తనని తాను నిరూపించుకున్నారు టైగర్. అయితే ఆయన తాజా చిత్రం యాక్షన్ లో మరో లెవల్ అన్నట్టుగా ఉండబోతుందని సినిమా అనౌన్స్ మెంట్ టీజర్ తోనే చెప్పేశారు మేకర్స్.