పటౌడీ ప్యాలెస్‌లో యానిమల్

బాలీవుడ్ కు అసలు సిసలు క్రైమ్ థ్రిల్లర్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తానన్నాడు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లోనే బిజీగా ఉన్నారు. ఆయన దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ హీరో తెరకెక్కున్న క్రైమ్ డ్రామా ‘యానిమల్’. రష్మిక మందన హీరోయిన్. అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా గురుగ్రామ్‌లోని పటౌడీ ప్యాలెస్‌లో చిత్రీకరణ జరుపుకుంటుంది. సెట్ నుంచి లీకైన ఓ ఫోటో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇందులో రణబీర్ కపూర్ బ్లాక్ టర్టిల్ నెక్ టీ-షర్ట్‌లో మ్యాచింగ్ బ్లాక్ ప్యాంట్‌తో కనిపించాడు. అనిల్ కపూర్ కూడా దాదాపు సేమ్ లుక్ లో దర్శనమిచ్చారు. పటౌడీల కాలం నాటి కథను సందీప్ వంగా సెలక్ట్ చేసుకున్నాడా ? లేక అది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఏపీసోడ్ నా ? అన్నది తెలియాల్సి ఉంది. ఇక రణ్ బీర్ – వాణీ కపూర్ జంటగా నటించిన ‘షంషేరా’ గత వారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మిక్సిడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా పూర్ కలెక్షన్స్ రాబడుతోంది.