డీజే టిల్లు గాడి పోరి అనుపమ ?

డీజే టిల్లు – బ్లాక్ బస్టర్ హిట్టు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. డీజే టిల్లు కి విమ‌ల్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. టిల్లూ మాట‌లు, బాడీ లాంగ్వేజ్‌, గెట‌ప్ అన్నీ హిట్టే. టిల్లుగాడి గర్ల్ ఫ్రెండ్ రాధిక గా నేహా శెట్టి అదరగొట్టింది. బోల్డ్ సీన్స్ లో మెప్పించింది. అయితే సీక్వెల్ లో దర్శకుడు విమల్ కృష్ణ లేడు. హీరోయిన్ గా నేహా శెట్టి కంటిన్యూ కావడం లేదు. మ‌ల్లిక్ రామ్ (అద్భ‌తం ఫేమ్‌) ఈచిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక నేహా శెట్టి స్థానంలో అనుపమ పరమేశ్వరన్ ను తీసుకోనున్నారట.

డిజే టిల్లు’లో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి. పార్ట్ 2లోనూ అవి కొన‌సాగే అవ‌కాశాలున్నాయి. వాటికి అనుప‌మ ‘ఓకే’ అంటే డీజే టిల్లులోకి అనుప‌మ ఎంట్రీ ఇచ్చిన‌ట్టే. ఒకట్రెండు రోజుల్లోనే దీనిపై క్లారిటీ రానుంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 2023లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.