ఈ ఏడాది చివర్లో ఖైదీ-2 .. క్లారిటీ ఇచ్చిన కార్తీ !

విక్రమ్ బ్లాక్ బస్టర్ హిట్ కంటే ముందు లోకేష్ కనగరాజ్ ఖాతాలో మరో సూపర్ హిట్ పడిన సంగతి తెలిసిందే. అదే ఖైదీ. కార్తీక్ కథానాయకుడిగా వచ్చింది. 2019 లో వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీనికి సీక్వెల్‌ ఎప్పుడు రూపొందుతుందోనని ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

కార్తి నటించిన ‘విరుమాన్‌’ తమిళ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ సినిమా  ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న కార్తి ‘ఖైదీ-2’ గురించి మాట్లాడారు. ‘‘వచ్చే ఏడాది చివర్లో ఖైదీ-2 ప్రారంభమయ్యే అవకాశముంది. నేనూ దాని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని చెప్పాడు.

ఇక ఇటీవల ‘విక్రమ్‌’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన లోకేష్‌ కనకరాజ్‌ ప్రస్తుతం ‘దళపతి-67’ సినిమా కోసం కసరత్తు చేస్తున్నారు. మరోవైపు కార్తి చేతిలోనే మూడు ప్రాజెక్టులున్నాయి. ఇవన్నీ పూర్తి చేసి కార్తి-కనకరాజ్‌ ‘ఖైదీ’ సీక్వెల్‌ కోసం రంగంలోకి దిగనున్నారు. అయితే ఖైదీ సీక్వెల్ లో కార్తీతో పాటు ఆయన అన్న సూర్య కూడా కనిపిస్తారనే ప్రచారం జరుగుతుంది.