రాంమాధ‌వ్ ‘మ‌గ‌త‌నం’ వ్యాఖ్య‌ల‌పై దుమారం..!

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మ‌గ‌త‌నం లేని వారంటూ బీజేపీ జాతీయ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి రాంమాధ‌వ్ వ్యాఖ్య‌ల‌పై ఆ పార్టీ నేత‌లు సీరియ‌స్ అయ్యారు. బీజేపీ సంస్కృతి ఇదేనా అంటూ టీఆర్ఎస్ నేత‌లు మండిప‌డ్డారు. నోరుంటే పశువులు కూడా సిగ్గుపడే భాష బీజేపీ నేత‌లు మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. బీజేపీ ఎమ్మెల్యేల మగతనం ఏపాటిదో గతంలో జరిగిన ఎన్నికల్లోనే తేలిపోయిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రాంమాధవ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

సంఘ్‌లో పనిచేశానని చెప్పుకునే రాంమాధవ్ మాట్లాడాల్సిన భాష ఇదేనా? అంటూ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. తెలంగాణలో కమలం పువ్వు ఎప్పుడో వాడిపోయిందని, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కేటీఆర్‌పై రాంమాధవ్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని ఆయ‌న అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని టీఆర్ఎస్ నేత‌లు విమ‌ర్శించారు.