నందమూరి హీరోల ఐక్యత వర్థిల్లాలి !

మెగా హీరోలు, మెగా ఫ్యామిలీలో కనిపించిన ఐక్యత నందమూరి ఫ్యామిలీలో కనిపించదు. ఈ విషయాన్ని తెలుగు తమ్ముళ్లు కూడా ఒప్పుకుంటారు. బహుశా.. నందమూరి ఫ్యామిలీ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉండటమే ఇందుకు ఓ కారణమని చెబుతున్నారు. అయితే అరుదుగా బాలయ్య, ఎన్ టీఆర్, కళ్యాణ్ రామ్ .. ఓకే వేదికపై కనిపించి అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా ఈ ముగ్గురు కలవలేదు. కానీ కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాను బాలయ్య వీక్షించారు. చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు.

బాలయ్య రాకతో నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు కొన్ని అంశాలను తెరపైకి తెస్తున్నారు. అవేటంటే ? కళ్యాణ్ పిలవగానే, లేదంటే పిలవకుండానే బాలయ్య బింబిసార సినిమా చూసేందుకు వచ్చి ఉంటారు. మరీ రేపటి రోజున టీడీపీ ప్రచారానికి బాలయ్య పిలిస్తే.. తారక్, కల్యాణ్ రామ్ వస్తారా  ? అని అడుగుతున్నారు. ప్రస్తుతానికి ఇది అక్కర్లేని ప్రశ్నే. కానీ తమ్ముళ్లు మాత్రం తారక్ టీడీపీ తరుపున ఎన్నికల ప్రచారం చేస్తే మరోసారి ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆశతో ఉన్నారు.