ప్రభాస్, ఎన్టీఆర్.. డబుల్ ధమాకా !

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సలార్ అప్ డేట్ సోమవారం వచ్చేసింది. ప్రభాస్ అభిమానుల చాన్నాళ్ల కోరిక తీరింది. సలార్ ను వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు సడన్ సప్రైజ్ ఇచ్చారు ప్రశాంత్ నీల్. తారక్ తో చేయబోయే సినిమా అప్ డేట్ ఇచ్చారు. సలార్ అప్ డే ఇచ్చే క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

ఈ సందర్బంగా ఎన్టీఆర్ గురించి మీడియా ప్రతినిధులు పదే పదే ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో తారక్ తో సినిమా వచ్చే ఏడాది మారి/ఏప్రిల్ లో షురూ అవుతుందని తెలిపారు. దీంతో 75వ స్వాతంత్య్ర దినోత్సవం వేళ ప్రభాస్, ఎన్ టీఆర్ అభిమానులకు డబుల్ దమాఖా అందినట్టు అయింది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ – ఎన్ టీఆర్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజైన సంగతి తెలిసిందే.