తెలుగు సినిమా రత్నం ఎన్టీఆర్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాట్లాడటం ఆనందంగా ఉందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఆదివారం తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా.. తారక్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో వీరి భేటీ జరిగింది. ఈ సమావేశమైన కొద్దిసేపటికే తారక్ ను కలిసిన ఫోటోలు తన ట్విట్టర్ ఖాతా లో షేర్ చేశారు షా

“అత్యంత ప్రతిభావంతుడైన నటుడు మరియు మన తెలుగు సినిమా తారక రత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో ఈ రోజు హైదరాబాద్‌లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది” అని రాసుకొచ్చారు. దీనికి సోమవారం ఉదయం తారక్ రిప్లై ఇచ్చారు. ‘మిమ్మల్ని కలవడం. మీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది అమిత్ షా జీ” అంటూ తారక్ రీ ట్వీట్ చేశారు.