దేశంలో రైతు ప్రభుత్వం రాబోతోంది : కేసీఆర్‌

వచ్చే ఎన్నికల్లో దేశంలో బీజేపీని పారద్రోలి రైతు ప్రభుత్వం రాబోతోందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. పెద్దపల్లిలో కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్‌ బహిరంగ సభలో మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అంశాన్ని మరోసారి ప్రస్తావించారు.

“మోటార్లకు మీటర్లు పెట్టాలన్న మోదీకే మీటర్‌ పెట్టాలి. జాతీయ రాజకీయాల్లోకి రావాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. మీటర్లు లేని విద్యుత్‌ సరఫరా చేయాలని కోరుతున్నారు. ఎన్‌పీఏల పేరుతో రూ.12లక్షల కోట్లు దోచిపెట్టారు. రైతులకు ఇవ్వడానికి మాత్రం కేంద్రానికి చేతులు రావడంలేదు. సింగరేణి ప్రైవేటీకరణ కుట్రను భగ్నం చేయాలి. బీజేపీ ముక్త్‌ భారత్‌ కోసం అందరూ సన్నద్ధం కావాలి” అని కేసీఆర్ పిలుపునిచ్చారు.