లైగర్ ఎఫెక్ట్ : ఛార్మి షాకింగ్ నిర్ణయం

హిట్ కొడితేనే ఇండస్ట్రీలో వాల్యూ. లేకపోతే చాలా కష్టం. లైగర్ అట్టర్ ప్లాప్ తో పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ అండ్ టీమ్ కు కష్టాలు షురూ అయినవి. సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ట్రోలింగ్ జరుగుతున్నది. విజయ్ బాగా నటించాడు. కానీ పూరి సరిగా తీయలేదు అనే కామెంట్స్ వినిపించాయి. లైగర్ ఫ్లాప్ పై ఇటీవల స్పందించిన ఛార్మి.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులను థియేటర్ కి రప్పించడం అంత ఈజీ కాదు. జనాలు ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు అన్నారు. అయినా.. లైగర్ ప్లాప్ పై ట్రోలింగ్ కు పులిస్టాప్ పడటం లేదు.

ఈ నేపథ్యంలో ఛార్మి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. పూరి కనెక్ట్స్ బిగ్గర్ అండ్ బెటర్ గా బౌన్స్ బ్యాక్ అవుతుంది. అప్పటి వరకు సోషల్ మీడియాకు సెలవు అన్నట్టుగా రాసుకొచ్చారు. అయితే ఛార్మి ఒక్కరే.. సోషల్ మీడియాను వీడుతున్నారా ? ఆమె తో పాటు పూరి జగన్నాథ్ కూడా ఈ పని చేస్తున్నారా ? అన్నది తెలియాల్సి ఉంది.

విజయ్ దేవరకొండ – అనన్య పాండే జంటగా లైగర్ తెరకెక్కింది. పూరి-విజయ్ ల తొలి పాన్ ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలక పాత్రల్లో నటించారు. అయితే నటీనటుల ఫర్ ఫామెన్స్ బాగున్నా.. కొత్తదనం లేని రాత-తీత లైగర్ కొంప ముంచాయని చెబుతున్నారు.