జడేజా స్థానంలో ఎవరంటే ?

ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ మజానే వేరు. అయితే వారం గ్యాప్ లో దాయాదులు రెండోసారి తలపడబోతున్నారు. సూపర్‌ 4లో భాగంగా భారత్‌-పాక్‌ల మధ్య ఆదివారం సాయంత్రం రసవత్తర మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే దాయాది దేశంపై విజయంతో జోష్‌ మీద ఉన్న టీమ్‌ఇండియా.. ఈ మ్యాచ్‌లోనూ తన సత్తా చాటాలని చూస్తోంది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా గాయం కారణంగా ఈ టోర్నీ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జడేజా స్థానంలో ఎవరు ఆడబోతున్నారు ? అన్నది ఆసక్తిగా మారింది.

ప్రస్తుతం భారత జట్టులో స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లుగా అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌, దీపక్‌ హూడా ఉన్నారు. జడేజా స్థానంలో దీపక్‌ హూడా, అశ్విన్‌ల్లో ఒకరిని ఎంచుకొనే అవకాశముంది. బ్యాటింగ్‌ ప్రధానమనుకుంటే హుడాకు, బౌలింగే ముఖ్యమనుకుంటే అశ్విన్‌కు ఛాన్స్‌ దక్కుతుంది. మరోవైపు అవేశ్‌ ఖాన్‌ జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. అవేశ్‌ స్థానంలో స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌కు అవకాశం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.