‘గుడ్‌ బై’ ట్రైలర్ టాక్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన నటించిన బాలీవుడ్ ఎంట్రీ చిత్రం గుడ్ బై. వికాస్‌ బహల్‌ దర్శకత్వం వహించారు. ఇందులో బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ కూతురుగా నటించింది.  అక్టోబరు 7న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. పుట్టిన రోజులు ఎన్నో ఉంటాయి కానీ చావు ఒక్కసారే వస్తుంది.. ఏ మనిషి పోయినా అంత్యక్రియలను వేడుకగా జరిపించాలని చెప్పే కథాంశంతో దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించినట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

భార్య మరణ వార్తను విదేశాల్లో ఉండే తనయులకు అమితాబ్‌ తెలియజేటం, వారు ఏదో పని ఉందంటూ తప్పించుకునే ప్రయత్నం చేయటం.. చివరగా అంత్యక్రియలు జరిపించటం.. తదితర సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. ఎమోషనే కాదు ఈ చిత్రంలో మంచి వినోదం ఉన్నట్టు కొన్ని సీన్స్‌ని బట్టి తెలుస్తోంది.