మహేష్-రాజమౌళి మూవీ.. ఓకే చెప్పినా అలియా !

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి చేయబోయే ఇప్పటికే సినిమా ఫిక్సయిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు హీరోగా జక్కన్న సినిమా రాబోతుంది. గ్లోబల్ మొత్తం ట్రావెల్ అయ్యే ఒక అడ్వెంచర్ సినిమా గా ఉంటుందని ఇటీవలే రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ప్రధానంగా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగుతుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లొకేషన్స్ లో కూడా ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నారని తెలిసింది.

తాజాగా ఈ సినిమా గురించి ఫిల్మ్‌ క్రిటిక్‌, ఓవర్సీస్‌ సెన్సార్‌ బోర్డు సభ్యుడు ఉమేర్‌ సంధు ఆసక్తికర విషయం చెప్పారు. మహేష్‌బాబుతో రాజమౌళి తీస్తున్న మూవీలో నటించడానికి ఆలియా భట్‌ అంగీకరించింది. ఎస్‌ఎస్‌ఎంబీ29 షూటింగ్‌ ఆలియా ప్రసవించిన తర్వాత ప్రారంభమవుతుందని ట్వీట్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో అలియా తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఆమె రెండో తెలుగు సినిమా ఎన్ టీఆర్ తో ఉండాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె గర్భవతి కావడంతో.. ఆ సినిమా నుంచి తప్పుకుంది.