OTTలో లైగర్ సంచలనం

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ‘లైగర్’. భారీ అంచనాల మధ్య గత నెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో ఆడలేదు. డిజాస్టర్ అయ్యింది. విజయ్ నటన బాగున్నా.. కథ-కథనంలో కొత్తదనం లేకపోవడంతో లైగర్ ను ప్రజలు తిరస్కరించారు.

ఇప్పుడీ ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 22 నుంచి “లైగర్” సినిమా స్ట్రీమింగ్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. దర్శకుడు పూరి జగన్నాథ్ కథ, సంభాషణలు, ప్రతి పాత్ర తీర్చిదిద్దిన పద్దతి, సంగీతం, విజయ్ దేవరకొండ నటన.. అన్నిటినీ ఒక ఫుల్ ఫామిలీ ఎంటర్ టైనర్ లా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. థియేటర్ లో పెద్దగా ఆడని లైగర్ ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది.