జాతీయ స్థాయిలో మహాకూటమి ?

దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యేందుకు బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌, ఆర్‌జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌లు సిద్ధం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో 2024 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటు దిశగానే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఊహాగానాలు మొదలయ్యాయి.”నీతీశ్‌ కుమార్‌ కలిసి ఢిల్లీలో సోనియా గాంధీతో త్వరలో సమావేశమవుతాం. పాదయాత్ర తర్వాత రాహుల్‌ గాంధీని కూడా కలుస్తాను. విపక్షాలు ఏకమైతే 2024 ఎన్నికల్లో బీజేపీని అధికారం నుంచి దూరం చేయవచ్చు’ అని శుక్రవారం లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు.