బుర్రిపాలెం వెళ్తున్న మ‌హేష్‌

ఇటీవ‌ల మ‌హేష్ బాబు మాతృమూర్తి ఇందిర మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. శనివారం 11 రోజుల కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఈనెల 16న కృష్ణ స్వ‌స్థ‌లం బుర్రిపాలెంలో ఓ స్మార‌క కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి కృష్ణ కుటుంబ స‌భ్యులంతా వెళ్తున్నార‌ని తెలిసింది. మ‌హేష్‌, న‌మ్ర‌త‌లు కూడా ఈ సంస్మ‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌బోతున్నారు.

ఇటీవ‌ల కృష్ఱంరాజు సంస్మ‌ర‌ణ స‌భ‌ని.. ఆయ‌న స్వగ్రామం మొగ‌ల్తూరులో నిర్వ‌హించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ల‌క్ష‌మంది హాజ‌ర‌య్యారు. వాళ్లంద‌రికీ ప్రభాస్ భోజ‌నాలు ఏర్పాటు చేశారు. తీరొక్క ఐటమ్స్ తో భోజనాలు పెట్టారు. అక్క‌డ వ‌డ్డించిన రుచుల గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు బుర్రి పాలెంలోనూ… అలాంటి కార్య‌క్ర‌మ‌మే నిర్వ‌హించాల‌ని మహేష్ ఫ్యామిలీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది.