ఢిల్లీ లిక్కర్ స్కాం : అభిషేక్ రావు తర్వాత ఎవరు ?

ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తెలంగాణ నుంచి తొలి అరెస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ప్రచారం జరుగుతున్న అభిషేక్ రావును సీబీఐ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఆ వెంటనే ఢిల్లీకి తరలించి.. సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఆయన్ని మూడ్రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ.. కోర్టు తీర్పునిచ్చింది.

అభిషేక్ రావు అరెస్ట్ తో  హైదరాబాద్ లో మరికొందరు ప్రముఖులకు సీబీఐ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో తెలంగాణ కేంద్రంగా కీలక పరిణామాలు చోటుచేసుకోవచ్చని భావిస్తున్నారు. అంతేకాదు..అభిషేక్ రావు తర్వాత అరెస్ట్ అయ్యేది కల్వకుంట్ల కవితే అని అంటున్నారు. మరోవైపు కవిత దేశం దాటారు. ప్రస్తుతం ఆమె యూఏస్ లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.