ప్రభాస్‌కు ఢిల్లీ కోర్టు నోటీసులు.. ఎందుకంటే ?

పాన్ ఇండియా ప్రభాస్ కు ఢిల్లీ కోర్టు నోటీసులు పంపింది. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్‌ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ ఇటీవలే విడుదల కాగా పలు వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే ఆదిపురుష్‌ చిత్రబృందం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందంటూ ఓ సంస్థ దిల్లీ కోర్టును ఆశ్రయించింది. అంతేకాకుండా ఆదిపురుష్‌ సినిమా విడుదలపై స్టే విధించాలని కూడా కోరింది.

తాజాగా ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన దిల్లీ కోర్టు ప్రభాస్‌తో పాటు ఆదిపురుష్‌ చిత్ర బృందానికి నోటీసులు జారీ చేసింది. ఆదిపురుష్ ట్రైలర్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. యానిమేటెడ్‌ చిత్రంలా ఉందని ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీలో రాముడు, రావణుడు, హనుమంతుడు పాత్రలను చూపించిన విధానం సరైందని కాదని ట్రోల్స్ చేస్తున్నారు.