పొట్టి ప్రపంచకప్‌.. టికెట్స్ హాట్ కేకుల్లా !

ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ ఆదివారం నుంచే ప్రారంభం కానుంది.  దాదాపు రెండేళ్ల కరోనా పరిస్థితుల అనంతరం జరుగుతున్న మెగా టోర్నీ కావడంతో.. ఈ సారి టికెట్లకు భారీ డిమాండ్‌ నెలకొంది. ఇప్పటికే 6 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయని నిర్వాహకులు తెలిపారు.

ఈ నెల 16 నుంచి తొలి రౌండ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. సూపర్‌-12లో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలను దక్కించుకోవడం కోసం తొలి రౌండ్లో ఎనిమిది జట్లు పోటీపడతాయి. ఈ నెల 22 నుంచి సూపర్‌-12 సమరం మొదలవుతుంది. సూపర్‌-12లో తొలి మ్యాచ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్య జరగనుంది. ఈ మెగా టోర్నీకి 7 ఆస్ట్రేలియా నగరాలు వేదికలుగా ఉన్నాయి. ఇక అందరి చూపు.. అక్టోబర్‌ 23న జరిగే దాయాదుల పోరుపైనే. చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాక్‌ తలపడే ఈ పోరుకు 90 వేలకుపైగా టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. అడిషనల్‌ స్టాండింగ్‌ రూమ్‌ టికెట్లు కూడా 10 నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి.