బీజేపీలోకి బూర నర్సయ్య గౌడ్ ?

మునుగోడు ఉప ఎన్నిక ముందు టీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలినట్టు తెలుస్తోంది. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మునుగోడు టికెట్ ఆశించిన సంగతి తెలిసిందే. నిన్నటి కూసుకుంట్ల నామినేషన్ కార్యక్రమంలోనూ ఆయన బూర పాల్గొన్నారు. అయితే అనూహ్యంగా ఆయన ఢిల్లీకి వెళ్లి బీజేపీ గుంపులో చేరినట్టు సమాచారం. ఇప్పటికే ఆయన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయినట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు మరో కీలక నేత కూడా కమలం తీర్థం పుచ్చుకోబోతున్నట్టు తెలుస్తుంది. 

మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఒట్టెద్దు పోకడులు నచ్చకనే బూర పార్టీ మారుతున్నట్టు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పేరున్న నేతలను ఒక్కొక్కరిని పార్టీలో చేర్చుకుంటుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమలం తీర్థం పుచ్చుకున్న నెల గ్యాప్ లోనే బూర రూపంలో మరో కీలక నేత ఆ పార్టీ లో చేరడానికి రెడీ కావడం విశేషం.