జ‌మిలి ఎన్నిక‌ల‌కు జై అన్న‌ టీఆర్ఎస్ ..!!

దేశ‌వ్యాప్తంగా ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు ప్రారంభించిది. ఇందుకోసం వివిధ పార్టీల అభిప్రాయాల‌ను తెలుసుకునేందుకు లా క మిష‌న్ ను రంగంలోకి దింపింది. ఇందులో భాగంగా జమిలీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం లా కమిషన్‌ తెలుగు రాష్ట్రాల్లో , టీఆర్ఎస్ పార్టీలతో చర్చలు జ‌రిపింది. ఈ స‌మావేశంలో టీఆర్ఎస్ త‌రపున ఎంపీ వినోద్ పాల్గొన్నారు. జ‌మిలి ఎన్నిక‌ల‌కు టీఆర్ఎస్ అంగీకారం తెలిపింది. పార్టీ త‌ర‌పున ఎంపీ వినోద్ ఈ అభిప్రాయాన్ని చెప్పారు. ఇప్ప‌టికే వ‌న్ నేష‌న్ వ‌న్ ఎల‌క్ష‌న్ కు టీఆర్ఎస్ అనుకూల‌మంటూ సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ కూడా రాశారు. జ‌మిలి ఎన్నిక‌ల‌కు సంపూర్ణ మ‌ద్ధ‌తు తెలిపారు.