కుప్పకూలిన కేదార్‌నాథ్‌ యాత్రికుల హెలికాప్టర్‌

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కేదార్‌నాథ్‌ యాత్రికులతో వెళ్తోన్న ఓ హెలికాప్టర్‌ కొండల ప్రాంతంలో కుప్పకూలింది. గరుడ్‌ ఛాటి ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

ఇప్పటివరకు ఆరు మృతదేహాలను గుర్తించారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు కాగా.. నలుగురు యాత్రికులని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.