రష్యా మంత్రికి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఫోన్‌

ఉక్రెయిన్‌- రష్యా వార్ మూడో వరల్డ్ వార్ కి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలు రష్యాను అణు ఆయుధాలు వినియోగించొద్దని కోరుతున్నాయి. తాజాగా భారత కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ రష్యాకు కీలక సూచనలు చేశారు.

ఇరు దేశాలూ పరస్పర దాడులకు అణ్వాయుధాలను ఆశ్రయించొద్దన్నారు. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగుతో రాజ్‌నాథ్‌ సింగ్‌ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌తో ఉన్న వివాదాన్ని వీలైనంత తర్వగా చర్చలు, దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించుకోవాలన్న భారత్‌ వైఖరిని మరోసారి స్పష్టంచేశారు. ఇద్దరు నేతల మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ సందర్భంగా షొయిగు ఉక్రెయిన్‌లోని పరిస్థితులను రాజ్‌నాథ్‌కు వివరించారని.. ఉక్రెయిన్‌ తమ దేశంపై డర్టీబాంబ్‌ ప్రయోగించేందుకు కవ్వింపులకు పాల్పడుతోందన్న ఆందోళనను కూడా వ్యక్తంచేశారని కేంద్ర రక్షణశాఖ తెలిపింది.