టీఆర్ఎస్.. ఓ డ్రామా కంపెనీ

ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తులు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడారు.టీఆర్ఎస్ ఒక డ్రామా కంపెనీ అన్నారు. గులాబీ పార్టీ కట్టు కథలు చూస్తే ప్రజలంతా నవ్వుకుంటారని విమర్శించారు. 

ఫామ్‌హౌజ్‌లో ఉన్నవాళ్లు బీజేపీ వాళ్లని ఎవరు చెప్పారు? ఫామ్‌హజ్‌ వాళ్లదే, ఫిర్యాదు చేసింది వాళ్లే. ఈ ఘటనపై మూడురోజులుగా ఎమ్మెల్యేలు సమావేశమై కుట్ర చేశారు. నలుగురు ఎమ్మెల్యేలను పీఎస్‌కు ఎందుకు తరలించలేదు? వారు నేరుగా ప్రగతిభవన్‌కు ఎలా వెళ్తారు? ఆ నలుగురు ఎమ్మెల్యేలను అర్ధరూపాయికి కూడా ఎవరూ కొనరు. తన పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించేందుకే ఈ నాటకమాడారు. ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా చూసుకునేందుకే ఈ నాటకం. కేసీఆర్‌ నాటకమంతా త్వరలోనే బయటపడుతుంది. ఈ నాటకమంతా త్వరలోనే కేసీఆర్‌ మెడకే చుట్టుకుంటుందని బండి సంజయ్ అన్నారు.