టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు.. ఓ కట్టు కథ !

నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి రాబోతున్నాయి. ఈ వ్యవహారంతో ఢిల్లీ పెద్దల ప్రమేయం ఉంది. వారిని వివరాలు బయటపెట్టబోతున్నారని టీఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నారు.

మరోవైపు ఇదంతా.. కేసీఆర్ అల్లిన డ్రామా అంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగిన వ్యవహారం సీఎం కేసీఆర్‌ అల్లిన కట్టుకథ అని బీజేపీ సీనియర్‌ నేత, ఎంపీ లక్ష్మణ్‌ ఆరోపించారు. ఈ కుట్రలో పోలీసులు భాగస్వామ్యం కావొద్దని సూచించారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ అంశంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ పై న్యాయపోరాటానికి రెడీ అవుతున్నట్టు లక్ష్మణ్‌ చెప్పారు.