ఎమ్మెల్యేల కొనుగోలు : హైకోర్టుకు సైబరాబాద్‌ పోలీసులు

నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సైబరాబాద్‌ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో ముగ్గురు నిందితులకు రిమాండ్‌ విధించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని హైకోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. సాధారణ పిటిషన్‌ వేయాలని, ఈ అంశంపై రేపు విచారిస్తామని తెలిపింది.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సరైన ఆధారాలు లేవంటూ నిందితులకు రిమాండ్‌ విధించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిరాకరించిన విషయం తెలిసిందే. 41 సీఆర్‌పీసీ కింద నోటీసులిచ్చిన తర్వాతే విచారించాలని స్పష్టం చేశారు. దీంతో నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లను పోలీసులు గురువారం విడుదల చేశారు. తాజాగా దీనిపై సైబరాబాద్‌ పోలీసులు హైకోర్టుని ఆశ్రయించారు.